చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
చేనేత వస్త్రాలపై విధించిన 5 శాతం జీఎస్టీ రద్దు చేయాలంటూ తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంటే కేంద్రం మాత్రం వారి నడ్డి విరిచేలా జీఎస్టీ విధించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఆధారపడిన చేనేత రంగానికి తగిన సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత రంగంపై జీఎస్టీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.













