రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.