కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మదాపూర్ లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు.
PMAY G పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం.
11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో వినతి పత్రం అందించిన సిఎం.
రాష్ట్ర డిమాండ్కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి వివరించిన సీఎం
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని తెలిపిన సీఎం
ఇవి కూడా చదవండి
ఎల్నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించిన సీఎం
వ్యవసాయ రంగంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరిన సీఎం
దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపిన సీఎం
సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామన్న సీఎం
ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నామని వివరించిన ముఖ్యమంత్రి
250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన సీఎం
పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి సహకరించాలని కోరిన సీఎం.








