భారత్ నెట్ పథకాన్ని… టీ-ఫైబర్కు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమన్నారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం. నెలకు రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ`ఎడ్యుకేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. టీ-ఫైబర్ అమలుకు ఎన్ఎఫ్ఓఎన్ సహకారం అవసరం. భారత్ నెట్ పథకాన్ని టీ`ఫైబర్కు వర్తింపజేయాలి. టీ-ఫైబర్కు రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వాలి అని సీఎం కోరారు.