జనగామలో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. అర్చుకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ శిలాఫకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు గాను కలెక్టరేట్ భవనాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. రూ.32 కోట్ల వ్యయంతో 25 ఎకరాల్లో మూడంతస్తుల్లో 34 శాఖలు కొలువుతీరేలా సమీకృత భవనాన్ని నిర్మించారు.
జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.