ఎమ్మెల్సీ కవితకు షాక్.. మార్చి 23 వరకు కస్టడీకి

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. సుదీర్ఘ వాదనల తర్వాత కవితకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదలను వినిపించగా, ఈడీ తరపున ఎన్.కె మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు.