పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్కు తెలియదా? : రఘునందన్

పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్రావు దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిందని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూలగొట్టలేదని అన్నారు. చెరువులు ఎక్కడెక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.