సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన ఎంపీ ధర్మపురి అర్వింద్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7వ తేదీన దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్దాంజలి సభకు సీఎంకు ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ను కలిసి ఆహ్వానించారు. ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మృతి చెందారు. శ్రీనివాస్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి డిఎస్ సతీమణి విజయలక్ష్మికి సంతాప లేఖ రాశారు. ఈ క్లిష్ల సమయంలో మా కుటుంబం పట్ల సానుభూతి తెలిపినందుకు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఎంపీ అరవింద్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.