బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికార మదం తలకెక్కిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమం మరిచి కేసీఆర్ నియంతలా పరిపాలిస్తున్నారని, కేసీఆర్ పాలనలో దౌర్జన్యాలు, భూకబ్జాలు పెరిగాయని ఈటల ఆరోపించారు. సీఎం కేసీఆర్ దోపిడీ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండవసారి ఓటు వేసిన తర్వాత కేసీఆర్కు కళ్లు నెత్తికి ఎక్కాయని, ప్రజలను మర్చిపోయి చక్రవర్తిలాగా, రాజులాగా పరిపాలిస్తున్నాడని మండిపడ్డారు. వేధించడం, డబ్బులు వసూలు చేయడం తప్ప ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పం కేసీఆర్కు లేదని అన్నారు.













