Ramachandra Rao: కాంగ్రెస్ కండువా కప్పుకున్న.. బీఆర్ఎస్ లోనే :రాంచందర్రావు
పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్కు చెందినవారమని చెబుతూ, స్పీకర్ ముందు మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం పూర్తిగా విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు (Ramachandra Rao) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs), ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా అనేదానిపై స్పష్టత లేకపోవడం సర్కారు దౌర్భాగ్యమన్నారు. తెలంగాణ రాజకీయాల్లో విలువలు క్షీణించే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ఆరోపించారు. ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. గతంలో ఫిరాయింపులను అరికట్టేందుకు ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని తెచ్చినకాంగ్రెస్సే ఇప్పుడు ఆ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఆ పార్టీతో ఎంఐఎం అంటకాగుతుందన్నారు. గ్రామ పంచాయతీలకు రూ.3,000 కోట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఆ నిధులు కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని ఆయన తెలిపారు.






