ఆ రెండు పార్టీల టార్గెట్ మేమే : బండి సంజయ్

పార్టీ కోసం పనిచేసేవాళ్లని కాంగ్రెస్, బీఆర్ఎస్ గుర్తించవని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆ పార్టీల తీరును కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. నాగోల్లో నిర్వహించిన బీజేపీ వర్క్షాప్నకు కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండి సంజయ్ మాట్లాడుతూ రుణమాఫీపై ప్రజల్లో చర్చ జరుగుతున్నందునే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడిరదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటని బీఆర్ఎస్.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఆ రెండు పార్టీల టార్గెట్ మేమే. ప్రతి కార్యకర్త ప్రజాప్రతినిధి కావాలనే లక్ష్యంతో పనిచేయాలి. బీజేపీ వల్లే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వ్యక్తులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలతో కోర్టులు తీర్పులు బెయిల్ ఇవ్వవు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ కలవడం పక్కా. బీఆర్ఎస్ ప్రభుత్వం 109 కేసులు పెట్టింది. రెండు సార్లు నన్ను జైలుకు పంపింది. కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తేలేదు. ఓబీసీ నేతను దేశ ప్రధానిగా చేసింది బీజేపీనే. ప్రతి ఒక్కరికీ బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలి. ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. 370 ఆర్టికల్ రద్దు చేసిన గొప్పనేత ప్రధాని మోదీ అని అన్నారు.