తెలంగాణలో అమిత్ షా పర్యటన
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖారారైంది. ఈ నెల 17న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ముందునుంచి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 17న విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్లో భారీ బహిరంగ సభకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ వెయ్యి ఊడలమర్రి వద్ద బహిరంగ సభలో అమిత్షా పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటన రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.













