అల్లం కు జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారం
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు 2019 సంవత్సరానికిగానూ జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పుంజాల అలేఖ్య ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి లోకాయుక్త జస్టిస్ కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్ర ద్వారా వర్సిటీ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ నెల 30న తెలుగు వర్సిటీలో జరిగే కార్యక్రమంలో అల్లం నారాయణకు పురస్కారం కింద ప్రశంసాపత్రంతో పాటు రూ.25వేల నగదు అందించి సత్కరిస్తారు.













