ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… నైట్ కర్ఫ్యూ ఎత్తివేత్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్ఛితంగా ధరించే నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగించాలన్న సీఎం జగన్ లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయాలని అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగ్గిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని తెలిపారు.













