బీజేపీలో చేరిన సాధినేని యామిని
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సాదినేని యామిని శర్మ కమలం గూటికి చేరారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం గత నవంబర్లో ఆమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. చంద్రబబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె సృష్టం చేశారు. తన వ్యక్తిగతమైన దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో టీడీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. తదనంతర పరిణామాల తర్వాత ఎట్టకేలకు ఆమె కమల దళంలో చేరారు. ఆమెతో పాటు పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.













