ఏపీలో 2339 కరోనా కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,739 మంది నమూనాలు పరీక్షించగా 57 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2339కి చేరింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 691 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1596 మంది కొవిడ్ బాధితులు డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన 57 కేసుల్లో ఆరుగురు కోయంబేడు కాంటాక్టు కేసులని అధికారులు వెల్లడించారు. కోయంబేడు కాంటాక్టు కొత్త కేసుల్లో చిత్తూరు జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు ఉన్నారు.






