ఇది ఇక్కడితో ఆగదు … చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు. సీఎం జగన్ మూర్ఘంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు. పోలవరంలో లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టెండర్ల వియంలో గడ్కరీ ఎన్నో సార్లు వద్దు అని చెప్పారని.. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్ట్పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.













