ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… పోటీ పరీక్షల్లో

ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల ఎంపికలో ఇకనుంచి ఇంటర్వ్యూలు ఉండబోవని చెప్పారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆదేశాలు వర్తిస్తాయని వెల్లడించింది. అంటే ఇకపై ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఉండవన్న మాట. అయితే ఇంటర్వ్యూలు లేకుండా మరి అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారో వేచి చూడాలి.