వారు అంగీకరించకపోతే .. ఖాతాలను

మే 15 నుంచి అమల్లోకి వచ్చిన తమ కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేమని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లు తమ కొత్త విధానాలను అంగీకరించకపోతే దశల వారిగా వారి ఖాతాలను నిలిపివేస్తామని పేర్కొంది. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ కపిల్ సి•ల్ ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. మా గోప్యతా విధానం ఐటి నిబంధనలను అతిక్రమించలేదు అని చాలా స్పష్టమైన ప్రకటన చేశాం, మేము అన్నీ నిబంధనల ప్రకారం వెళ్తున్నాం అని సిబల్ కోర్టుకు చెప్పారు. ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లు యాప్ను వాడేందుకు అనుమతించట్లేదంటూ వినిపించిన వాదలను వాట్సాప్ ఖండించింది.
కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (2000) లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయని చెప్పారు. అలాగే దీనిపై కేంద్ర సంస్థ వాట్సాప్ ఉన్నతాధికారులకు లేక రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని తెలిపింది. వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ పిటిషనర్లు కోరగా హైకోర్టు నిరాకరించింది. విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.