లాక్డౌన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రాణాంతక కోవిడ్ 19 రెండో దశ ఉధృతి కొనసాగుతున్న వేళ సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో సామూహిక సమావేశాలు, వేడుకలు అన్నింటిని కూడా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవాలి తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆక్సీజన్ నిల్వలు అధికంగా ఉండేలా చర్యలు తీసుకోండి. కొవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. కనుక లాక్ డౌన్ పై కూడా ఆలోచిస్తే మంచిదని అత్యున్నత ధర్మాసనం సూచించింది.
వైద్య సిబ్బందికి ఈ సమయంలో అన్ని వసతులు కల్పించాలి. అంతేకాదు వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలంటూ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా త్వరితగతిన చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో లాక్డౌన్ విధించినట్లయితే వలస కార్మికులు సహా ఇతర బడుగు జీవులు ఇబ్బందులు పడకుండా వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.