నిన్న యమునోత్రి…నేడు గంగోత్రి

ఉత్తరాఖండ్లోని గంగోత్రి ఆలయాన్ని ఇవాళ ఉదయం 7:30 నిమిషాలకు ఆలయ ద్వారాలను ఓపెన్ చేశారు. సాంప్రదాయ రీతిలో ఆలయ పూజారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం పూజారులు, కొద్ది మంది భక్తులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఛార్థామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయాన్ని నిన్ననే తెరిచిన విషయం తెలిసిందే. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చార్థామ్ యాత్రను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.