ఐదుగురు అక్కా చెల్లెళ్లు అందరూ కలెక్టర్ లే…!

ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్ అయితే వీధి వీధి సంబంరాలు. ఆఏరియా అంతా హంగామా మామూలుగా ఉండదు. అదే ఆ ఇంట్లో వారంతా కలెక్టర్లు అయితే కుటుంబానికి ఆనందానికి హద్దులే ఉండవు కదా. అటువంటి అరుదైన కుటుంబం సహదేవ్ సహరన్ కుటుంబం..
ఆయనెమన్న ధనవంతుడా అనుకునేరూ.. కానే కాదు సాదాసీదా మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు. 1) రోమా, 2) మంజు, 3) అన్షు, 4) రీతు, 5) సుమన్, అని నామకరణం చేశారు. కొడుకులు లేరని ఏనాడు కుంగిపోలేదు సహదేవ్.
అయితే తనకు కలెక్టర్ కావాలన్న కోరిక ఉండగా…ఆ విషయాన్ని తన కుమార్తెలకు చెపుతుండేవారు. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో తండ్రిని అర్థం చేసుకున్న తనయలు.. ఎంతో కష్టపడి చదివారు. ఐదుగురు ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవడమే కాకుండా… కలెక్టర్లుగా ఎంపికయ్యి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు.
ఈ అరుదైన కుటుంబం రాజస్తాన్లోని హనుమాఘర్ లో నివసిస్తోంది. 2018 లో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు ప్రకటించగా… అన్షు, రీతు, సుమన్ లకు అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కు ఏకకాలంలో ఎంపికయ్యారు అందర్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా… తమ వైపుకు దృష్టిని ఆకర్షించేలా చేశారు ఈ యువతులు.
ఇప్పటికే ఆ ఇంట్లో రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండటం విశేషం.