షెడ్యూల్ ప్రకారమే.. ఐదు రాష్ట్రాలకు

2022లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(సిఇసి) తెలిపింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ముగియనుండగా, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్చంద్ర తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 సెకండ్వేవ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. వైరస్ విజృంభణ సమయంలో బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉన్నదని సుశీల్చంద్ర గుర్తు చేశారు.
అసెంబ్లీల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించి, విజేతల జాబితాలను గవర్నర్లకు అందించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దన్నారు. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ గడువు 2022 మార్చిలో, ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే నెలలో ముగియనున్నది.