కేంద్ర మాజీ మంత్రి బలరాంకు… ఎన్నికల సంఘం షాక్

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభల్లో పోటీ చేయకుండా సీఈసీ వేటు వేసింది.2019 లోక్సభ ఎన్నికల్లో నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను బలరాం నాయక్ సమర్పించలేదు. దీంతో బలరాం నాయక్పై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. బలరాం నాయక్పై వేటే వేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2009లో కాంగ్రెస్ తరపున ఎంపీగా బలరాం నాయక్ ఎన్నికయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్లో ఆయన మంత్రిగా పని చేశారు.