గూగుల్ సెర్చ్ వద్దు… పోలీసుల సూచన

కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్న తమవారిని కాపాడుకోవాలన్న తొందరలో కొందరు గూగుల్లో వైద్యం, ఐసీయూ బెడ్లు, అంబులెన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు సైబర్ దొంగలు తమ ఫోన్ నంబర్లు పెట్టి, ముందుగా కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా పే చేయాలని అడుగుతున్నారు. ఆ మొత్తం కట్టి వాళ్లు చెప్పిన దవాఖానకు వెళ్తే అసలు విషయం బయటపడుతోందని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఫిర్యాదులు చాలా అందాయని వెల్లడించారు. గూగుల్లో ఉండే ఫోన్ నంబర్లను నమ్మి మోసపోవద్దని, ఆయా దవాఖానల, మెడికల్ కంపెనీల అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కాంటాక్ట్ నంబర్లు తీసుకోవటం ఉత్తమమని పోలీసులు సూచించారు. కరోనా రోగులు బంధువులు ముందుగానే సమచారం సేకరించుకోవాలని అన్నారు.