ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హోం డెలివరీకి

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ ఇచ్చినవారికి హోం డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. భారతీయ కంపెనీలకు చెందిన మద్యం కానీ, విదేశాలకు చెందిన మద్యాన్ని అయినా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఢిల్లీ అబ్కారీ శాఖ ప్రకటన ప్రకారం ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేయవచ్చు. కానీ కచ్చితంగా ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం మద్యం హోండెలివరీ ఉండదన్నారు. ఎల్-13 లైసెన్సు లేని వారు మద్యం హోం డెలివరీ చేయరాదు. మద్యం హోం డెలివరీపై మద్యపానప్రియులు సంతోషం వ్యక్తం చేశారు.