సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన నిర్ణయం …
మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్పై కొరడా రaుళిపించేందుకు సిద్ధమైన 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. అందులో ఐదుగురు కేబినెట్, నలుగు సహా మంత్రుల మంత్రిత్వ శాఖలను వేరేవారికి అప్పగించారు. రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల్లో జాప్యం జరగకూదని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.













