చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో… కొనసాగడం లేదు

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని ఆ పార్టీ ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్వవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం తర్వాత మన్మోహన్ కేబినెట్లో చిరంజీవి చోటు దక్కించుకున్నారు. తరువాత స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చిరు పాత్ర పెద్దగా కనపడటం లేదు. తాజాగా అంశంపై ఉమెన్ చాందీ క్లారిటీ ఇచ్చారు.