షిర్డి సాయినాధుని సేవలో చంద్రబాబు దంపతులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటించారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయినాథుడి దర్శనం చేసుకున్నారు. ఇక రాత్రికి చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత రాజకీయ కార్యకలాపాలతో ముమ్మరంగా గడిపిన చంద్రబాబు, పోలింగ్ పూర్తయ్యాక మళ్లీ పుణ్యక్షేత్రాల బాటపట్టారు. ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు తాజాగా కొల్లాపూర్, షిర్డీ వెళ్లారు.