ముఖేశ్ అంబానీ ఇంట హల్దీ వేడుకలు

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి ఈ నెల 12వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా అంబానీ ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మునిగి తేలుతోంది. తాజాగా హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం సహా బాలీవుడ్ తారలంతా హాజరై సందడి చేశారు. ఈ వేడుకల్లో కాబోయే కొత్త జంట అనంత్`రాధిక పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ముఖ్యంగా రాధికా మర్చెంట్ మరోసారి ఫ్యాషన్ పై తనకున్న మక్కువను చాటుకుంది. హల్దీ వేడుకల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన పసుపు రంగు డ్రెస్ పై పూల దుపట్టాతో ఆకట్టుకుంది. ఈ దుపట్టా మొత్తం నిజమైన మల్లెపూలతో డిజైన్ చేసిందిగా తెలుస్తోంది. దుపట్టా చుట్టూ బార్డర్లా బంతిపూలను అమర్చినట్లుగా ఉంది. వీటితోపాటు నగలు, చెవిపోగులు, గాజులు కూడా పూలతో తయారు చేసినట్లుగా ఉంది.