24 గంటల్లో మరో 4 వేల మంది…

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 18,75,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3,43,144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మరో 4 వేల మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,62,317కి చేరుకుంది. తాజాగా 3,44,766 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,46,809కు చేరాయి. ఇప్పటి వరకు 2,00,79,599 బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 31,13,24,100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో ప్రస్తుతం 37,04,893 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 17,92,98,584 మందికి వ్యాక్సిన్ వేశారు.