జైపూర్ మాజీ మహారాజు పృథ్వీరాజ్ మృతి

కోవిడ్-19 సమస్యలతో రాజస్థాన్ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజు, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) బుధవారం సాయంత్రం మరణించారు. కోవిడ్-19 బారిన పడి కోలుకున్న ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస తీసుకున్నారు. జైపూర్కు చెందిన పూర్వపు రాజకుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ రాజస్థాన్ను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఒకప్పటి జైపూర్ పాలకుల నివసించిన ప్రసిద్ధ రాంబాగ్ ప్యాలెస్ డైరెక్టర్గా ఉన్నారు.