భారత్ లో పుట్టడం నా అదృష్టం

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్ను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో ఉండటం తన అదృష్టం ఇందుకు తనకు గర్వంగా ఉందంటూ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో నైపుణ్యంతో తనకు టీకా వేసిన నర్స్ రమ్యకు థ్యాంక్స్ చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ, సరైన సమయంలో, సరసమైన ధరలో టీకా లభిస్తున్న దేశంలో పుట్టడం తన అదృష్టం అంటూ ట్వీట్ చేశారు.
కాగా దేశంలో ప్రస్తుతం రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 60 ఏళ్లదాటినవారికి, 45 సంవత్సరాలు పైబడి, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ దశలో వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా పలు కేంద్ర మంత్రులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రంగాల దిగ్గజాలు టీకాను వేయించుకున్నారు.