Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Corona » Covid19 » Covid 19 pandemic in india

కరోనా పోవాలంటే మూడేళ్లు పడుతుందా?

  • Published By: cvramsushanth
  • May 12, 2021 / 10:34 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Covid 19 Pandemic In India

భారత్‌లో కరనా సెకెండ్‌ వేవ్‌ వణికించేస్తోంది. మరి వైరస్‌ వ్యాప్తి ఉధృతి తగ్గాలంటే ఎలా? ఇలాగే కొనసాగితే మాత్రం ఇప్పట్లో కంట్రోల్‌ కావడం కష్టమే. వైరస్‌ బలహీన పడాలంటే పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ జరగాలి. అంటే 130 కోట్ల మందికి అవసరం లేదు. కనీసం.. 70 శాతం మందికి అంటే 94 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు హెర్డ్‌ ఇమ్యూనిటీ స్థాయికి చేరుతుంది. అది జరిగితేనే వైరస్‌ కంట్రోల్‌ అవుతుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలోనూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. కానీ, మన దేశంలో ఇప్పుడున్న వేగంతో వ్యాక్సినేషన్‌ కొనసాగుతూ… 70 శాతం మందికి వ్యాక్సిన్లు పూర్తయి… హెర్డ్‌ ఇమ్యూనిటీ రావడానికి కనీసం మూడున్నరేళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే 70 శాతం ప్రజానీకానికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మనదేశంలో 94.5 కోట్ల మందికి టీకా రెండు డోసులూ వేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం 189 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అవసరం. 

Telugu Times Custom Ads

ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం… ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 19 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేసింది. మరోవైపు వ్యాక్సిన్‌ డోసుల సరఫరా గురించి కేంద్రం చెబుతున్న మాటలు, రాష్ట్రాల్లో పరిస్థితుల మధ్య పొంతన కుదరడం లేదు. దేశంలో వ్యాక్సిన్‌ల కొరత లేదని, మే 10వ తేదీ నాటికి మొత్తం 17.26 కోట్ల డోసులు ప్రజలకు పంపిణీ చేశామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 18 కోట్ల డోసులకుపైనే సరఫరా చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ వెల్లడించారు. దాదాపు కోటి డోసులు వివిధ రాష్ట్రాల వద్ద పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. 

ఇండియాలో రోజూ దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల దాకా కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. అదే సమయంలో రోజూ వేస్తున్న వ్యాక్సిన్ల సంఖ్య 30 లక్షలు కూడా దాటట్లేదు. ఫలితంగా జనవరి నుంచి ఇప్పటి వరకూ వేసిన మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 17.27 కోట్లే. ఇదే విధంగా కొనసాగితే సెప్టెంబర్ చివరకు ఎక్కువలో ఎక్కువ మరో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుంది. అంటే మొత్తం వ్యాక్సిన్లు వేయించుకున్న వారి సంఖ్య 50 కోట్లకు దాటదు. అలాంటి సమయంలో థర్డ్ వేవ్ వస్తే… వ్యాక్సిన్లు వేసుకున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అదే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తే… వైరస్ బలహీనపడుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే కనీసం మరో 70 కోట్ల మందికి టీకాలు పడాలి. అలా జరగాలంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయాలి. అంటే వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. అది కూడా మూడో వేవ్ వచ్చేలోపే వేయాలి.

బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్, సింగపూర్ లాంటి దేశాల్లో వ్యాక్సిన్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఇండియాలో విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చినా… ఇంకా వాటి లభ్యత పూర్తి స్థాయిలో లేదు. 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అనుమతి ఉన్నా… వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. 45ఏళ్ల లోపు వారికి ఫస్ట్‌ డోసులు కూడా వేసే పరిస్థితి లేదు. సెకెండ్‌ డోస్‌ పెండింగ్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తూ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వాటి కోసం కూడా జనాలు విపరీతంగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలపై వచ్చి పడుతున్నారు. అయినా ఉపయోగం ఉండట్లేదు. మరి సమస్య నుంచి ఎప్పుడు బయటపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

 

Tags
  • Covid-19
  • deaths
  • India
  • pandemic
  • vaccine

Related News

  • Modi Urges States To Boost Manufacturing Strengthen Aatmanirbharta Amid Tariff Challenges

    Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..

  • Rahul Gandhi Accused Of Instigating Gen Z Against Narendra Modi Govt

    Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?

  • Rahul Gandhi Kharge Fires On Modi Over H1b Visa

    H1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్

  • Center Warns Against Job Offers In Iran

    Randhir Jaiswal : వారి ట్రాప్‌లో పడొద్దు …అప్రమత్తంగా ఉండాలి : కేంద్రం వార్నింగ్‌

  • India Us Trade Talks Positive Randhir Jaiswal

    India-US: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం: రణధీర్ జైస్వాల్

  • Rahul Gandhis Brain Has Been Stolen Devendra Fadnavis

    Rahul Gandhi: రాహుల్ గాంధీ మెదడు చోరీకి గురైంది: దేవేంద్ర ఫడ్నవీస్

Latest News
  • Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
  • Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
  • Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
  • US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
  • White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్‌హౌస్‌ క్లారిటీ
  • Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
  • BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
  • YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
  • Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
  • Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer