తెలంగాణలో కొత్తగా 2,256 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,256 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 615కి పెరిగింది. తాజాగా కోవిడ్ నుంచి 1,091 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330గా ఉంది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 464, వరంగల్ అర్బన్ జిల్లాలో 187, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్ జిల్లాలో 138, కరీంనగర్ జిల్లాల్లో 101 కేసులు బయటపడ్డాయి.






