దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా…

దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 88,977 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 1,587 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 26,89,60,399 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది.