TANA: తానా తెలుగు భాషా యువభేరి విజయవంతం

తెలుగు వ్యావహారిక భాషోద్యమ మూల పురుషుడు, గిడుగు వెంకట రామ్మూర్తి (ఆగస్టు 29) 162వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన ‘‘తెలుగుభాషా యువభేరి’’ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తానా (TANA) సాహిత్యవిభాగం-తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెలుగు పేరిట గత ఐదున్నర సంవత్సరాలుగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 83వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలుగు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు గిడుగు తెలుగును గ్రాంథిక భాష నుంచి వ్యావహారిక భాషగా మార్చే ప్రయత్నంలో చేసిన కృషిని సోదాహరణంగా వివరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘9వ తరగతి చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థుల నుంచి మొదలు ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల వరకు కేవలం తెలుగుభాషలో ప్రావీణ్యమే గాక, అవధానాలు చేసే స్థాయికి ఎదిగిన యువతీ యువకులు చూపిన సాహితీ ప్రతిభ, వెదజల్లిన సాహితీ పరిమళాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదా యకమైనవి’ అని అన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సినీగీత రచయిత త్రిపురనేని కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ ‘నేను పట్టాలు పొందింది తెలుగులో కాదు, చదువుకున్నది ఎంటెక్, ఎంబీఏ అయినప్పటికీ తన తాత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో గురువుల శిక్షణ తనకు తెలుగు భాషామాధుర్యాన్ని చవిచూసే అవకాశం కల్పించి, నేడు తెలుగు సినిమా రంగంలో దాదాపు వంద పాటలు రాసే స్థాయికి తీసుకెళ్లింది. చిన్నతనం నుంచే పిల్లలకు తెలుగు నేర్పే బాధ్యత తల్లిదండ్రులదే’ అని అన్నారు.
విశిష్ట అతిథులుగా పాల్గొన్న అద్దంకి వనీజ, 9వ తరగతి విద్యార్థిని, విజయవాడ – ఘనమైన గద్యం, అష్టావధాని వింజమూరి సంకీర్త్, 9వ తరగతి విద్యార్థి, హైదరాబాద్ (వింజమూరు, నల్గొండ జిల్లా) – శతక సాహిత్యంబీ బులుసు రమ్యశ్రీ, పదో తరగతి విద్యార్థిని (భీమడోలు, ఏలూరు జిల్లా) – ఆధునిక సాహిత్యంబీ శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, బీఏ విద్యార్థి, తిరుపతి – ఉదాహరణ కావ్యవైభవంబీ అష్టావధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పీహెచ్డీ విద్యార్థి, తిరుపతి (బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా)-అవధానంలో సామాజిక దృక్పథంబీ అష్టావధాని డాక్టర్ బోరెల్లి హర్ష, బి.డి.ఎస్, దంతవైద్యులు, కర్నూలు – వర్ణనబీ అష్టావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఎం.టెక్ విద్యార్థి, ఐఐటీ, ఖరగ్పూర్ (హైదరాబాద్) – నిషిద్ధాక్షరిబీ అష్టావధాని గట్టెడి విశ్వంత్, పీహెచ్డీ విద్యార్ధి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మెట్పల్లి, జగిత్యాల జిల్లా) – తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలుబీ అష్టావధాని బాణావత్ నితిన్ నాయక్, బీటెక్, ఐఐఐటీ, బాసర (నిర్మల్) – అవధానవిద్య-ఒక సమీక్ష, అష్టావధాని సుసర్ల సుధన్వ, ఎంబీబీఎస్ విద్యార్థి, చెన్నై (హైదరాబాద్) -సమస్యాపూరణం అనే అంశాల మీద అద్భుత ప్రసంగాలు చేసి అందరినీ ఆశ్చ్యర్య పరచారు.