కరోనా వల్ల సినిమా పరిశ్రమకు వచ్చే నష్టమేమీ ఉండదు – ఎస్.ఎస్.రాజమౌళి
‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఈయన దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రకథానాయకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ ఆర్ ఆర్)’. షుమారు రూ.350 కోట్ల బడ్జెట్తో హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాున్నాయి. ఇప్పటికే డెబ్బై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ లాక్డౌన్ తో ఆగింది. ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇంటర్వ్యూ…
లాక్డౌన్ లో ‘బీ ది రియల్ మాన్‘ ఛాలెంజ్ లో మీరు ఎలా స్వీకరించారు?
‘బీ ది రియల్ మాన్’ ఛాలెంజ్ అనేది ఇటీవల వారం క్రితం స్టార్ట్ అయ్యింది కానీ లాక్డౌన్ విధించిన నాటి నుండి కూడా మా ఇంటి పనులు మేమే చేసుకుంటున్నాం…. మా ఇంట్లో రమా చెప్పినట్లుగానే అందరూ నడుచుకుంటున్నాం. ఆమె మాలో ఒకొక్కరికి వారి వారి గదులను శుభ్రం చేసుకోమని చెప్పింది. కాబట్టి నిద్ర లేచిన తర్వాత ఎవరి రూమ్ వాళ్లు తడి గుడ్డ పెట్టి శుభ్రం చేసుకోవాలి. ఎవరి బట్టలు వారు ఉతుక్కోవాలి. రూంలు ఊడ్చటం, బట్టలు ఉతకడం, తడిగుడ్డ పెట్టడం వంటి పనులు అందరూ చేయాల్సిందే. అలాగే చేస్తున్నాం
లాక్డౌన్ సమయం లో ఇంకా టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు?
మిగతా ఖాళీ టైమ్లో …నాకు వంట చేయడం రాదు కానీ ఇంతకు ముందు చెప్పినట్లు మిగతా పనుల్లో సాయం చేస్తున్నాను. ఈ పనులను పూర్తి చేసే సరికి మధ్యాహ్నం అవుతుంది. ఆ సమయంలో టీవీలో వచ్చే సినిమాలు లేదా నెట్ఫ్లిక్స్లో సిరీస్ను చూస్తున్నాం. సాధ్యమైనంత వరకూ బ్రెయిన్కి ఆలోచించే టైమ్ ఇవ్వకుండా ఇంటి పనుల తో గడపడానికి ట్రై చేస్తున్నాం. పాత హాలీవుడ్ సినిమాు బాగా చూస్తున్నా. రీసెంట్గానే ‘ఆల్ ఎబౌట్ ఈవ్’ అనే బ్లాక్ అండ్ వైట్ హాలీవుడ్ క్లాసిక్ సినిమా చూశా. మనవారు తీసిన వెబ్సిరీస్లో నీరజ్ పాండే తీసిన ‘స్పెషల్ ఆప్స్’ హిందీ సిరీస్ చూశా. ఒక ఎపిసోడ్ చూస్తే.. నెక్ట్స్ ఎపిసోడ్ చూడాన్నంత ఇంట్రెస్ట్ కలిగించింది.
లాక్డౌన్ ప్రభావం ఎలా వుంది?
ఇంత ప్రమాదకరమని ఊహించలేదు…కరోనా ఇండియాలోకి రాగానే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎలర్ట్ అయ్యాయి. లాక్డౌన్ను విధించాయి. నిజంగా లాక్డౌన్ అనే విషయాన్ని ఊహింలేదు. కానీ జరిగింది. మన లైఫ్ లో ఇదో వండర్ అనే చెప్పాలి. దీని వల్ల అన్నీ రంగాకు ఇబ్బందే అని చెప్పాలి. అయితే ఒక్క సారిగా ఈ పరిస్థితి నుండి బయటపడలేం. నెమ్మదిగా బయటకు రావాల్సి ఉంటుంది. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూడడం తప్ప ఈ వైరస్ ప్రభావం ఇంత భయంకరంగా ఉంటుందని ఊహించలేదు. ‘బాహుబలి’ తర్వాత ఏడాదిపాటు ఇంట్లోనే ఉండి గడిపాను. ఇన్ని రోజులు గడప దాటకుండా ఇంటికే పరిమితం కావడం మాత్రం ఇదే మొదటిసారి.
కరోనా వైరస్ నివారణ కోసం మీ వంతు చేస్తున్న యుద్ధం?
వాళ్లే రియల్ హీరోస్.. కరోనా వైరస్ నివారణ కోసం పాటు పడుతున్న డాక్టర్స్, ఇతర వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుద్ద్య కార్మికులు వీరందరి గురించి, ఈ పరిస్థితి గురించి లోకానికి తెలియ చేసే మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు ప్రజలకు చేస్తున్న సేవ చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. హీరోలు చెబితే ఫ్యాన్స్, ప్రజలు కూడా వింటారని ఎన్టీఆర్, రామ్చరణ్లతో అవగాహన కల్పిస్తూ ఓ వీడియో రూపొందించాం. అది జనాలకు బాగా రీచ్ అయింది. కరోనా అనే కాదు ఏ విషయంలోనైనా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసు కున్నాకే ఫార్వర్డ్ చేయాని మా టీమంతా నిర్ణయించుకున్నాం. వాటిపై కూలంకశంగా చర్చించే జయప్రకాశ్ నారాయణ్, ప్రొ.నాగేశ్వరరావు, హెల్త్ ఎక్స్పర్ట్ వీడియోు చూసి మన భవిష్యత్తు ఏంటనే దానిపై ఎనలైజ్ చేసుకుంటున్నాం
కరోనా వల్ల సినీ పరిశ్రమ ఏమైనా దెబ్బ తింటుందా?
ఇదే మన ముందున్న అతి పెద్ద సవాల్ ఇప్పుడు చిత్ర పరిశ్రమను కరోనాకు ముందు, కరోనా సమయంలో, కరోనా తర్వాత అని మూడు విభాగాుగా విభజించవచ్చు. కనీసం రెండేళ్లు కరోనా టైమ్గా భావించవచ్చు. ఈ టైమ్లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఏ విధంగా మనగుగుతుంది? అన్నది అతిపెద్ద సవాల్. దాన్ని అన్వేషించాలి. భవిష్యత్తులో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను విధిస్తుందో తెలియదు. సినిమా హాళ్లు మూసివేయవచ్చు. ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కార్మికులు సినీ రంగంలో సుమారు 15వేలా మందికి పైగా ఉంటారని నా అంచనా. ఎలాంటి నిబంధన మీద వాళ్లకు పని చేసుకొనే అనుమతి ఇస్తారో తెలియదు. ఆ నిబంధనకు లోబడి కంటెంట్ జనరేట్ చేయాలి. నాకు తెలిసి… కనీసం ఆరు నుండి ఎనిమిది నెలలు థియేటర్లు క్లోజ్ చేస్తారని అంటున్నారు.
ఈ సమయంలో ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి? ప్రజలకు ఎలా చేరవేయాలి? అనేది వినూత్న ప్రక్రియ. ఒక్క నెలలోనే జనాలు డిఫరెంట్ కంటెంట్ వైపు చూడటం మొదలెట్టారు. ఇంతకు ముందు అదే కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ… చూడనివారు సైతం, ఇప్పుడు చూస్తున్నారు. మారుమూల పల్లెటూళ్లలో నెట్ఫ్లిక్స్ సిరీస్, ప్రపంచ భాషల్లో సినిమా గురించి మాట్లాడుతున్నారు. కరోనా టైమ్లో ఆసక్తికరమైన కంటెంట్ క్రియేట్ చేయాలి. థియేటర్లు వెంటనే ఓపెన్ చేయడానికి ప్రభుత్వం కొన్ని నిబంధను విధిస్తుందని అనుకుంటున్నా. రెండేళ్ల (కరోనా) తర్వాత, వ్యాక్సినేషన్ వచ్చాక… ఇంతకు ముందులా స్వేచ్ఛగా తిరగొచ్చని ప్రభుత్వం చెప్పినప్పుడు… కెరటంలా ప్రజలు థియేటర్లకు దూసుకొస్తారు.ప్రస్తుతం సినిమాకు ఇప్పుడు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చునేమో కానీ ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే టివి, తర్వాత స్టార్ నెట్వర్క్ వచ్చినప్పుడు ‘టీవీల్లో వందల సినిమాలు వస్తుంటే థియేటర్లకు ఎవరొస్తారు?’ అని అప్పట్లో అనుకున్నారు. విషయం ఏంటంటే… వెండితెర ప్రేక్షకులు వేరు. బుల్లితెర ప్రేక్షకులు వేరు. కొందరు రెండూ చూస్తారు. వెబ్ వచ్చిన తర్వాత వెండితెర నుండి కొంతమంది, బుల్లితెర నుండి కొంతమంది ప్రేక్షకును తనలో కలుపుకుంది. వెబ్ సిరీస్కు సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. నో డౌట్… కరోనా వల్ల సినిమా నుండి వెబ్ సిరీసకు వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. అయితే… థియేటర్కు వచ్చే ప్రేక్షకులు ఎప్పుడూ తప్పకుండా ఉంటారు.
‘ఆర్ఆర్ఆర్’..ఎంత వరకు వచ్చింది?
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆన్ పేపర్, క్రియేటివ్ వర్క్ తక్కువ ఉంది. ఎగ్జిక్యూషన్ వర్క్ మాత్రమే ఉంది. అబ్రాడ్ స్టూడియోల్లో వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. వారంలో రెండు, మూడు రోజులు ఆ పని జరుగుతోంది. ఆన్లైన్లోనే రివ్యూు, సీజీ కరెక్షన్లు చేసుకుంటున్నాం. నాన్నగారు వాళ్ల ఆఫీస్లో ఉండిపోయారు. అన్నయ్య రాజమండ్రిలో ఉన్నాడు. స్కైప్, జూమ్ టూల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త్రీవే కాల్స్లో వేర్వేరు గా కథను డెవలప్ చేసుకుంటున్నాం
ఎన్టీర్ భీమ్ ప్రోమో గురించి…అతని పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తారా?
రామ్చరణ్ పుట్టినరోజున విడుద చేసిన టీజర్ వర్క్ అంతా లాక్డౌన్కి ముందే పూర్తయింది. ఎవరి ఇళ్లల్లో వారు కూర్చుని పని చేశారు. అయితే లాక్డౌన్ సమయంలో ట్రయిల్ విడుద చేయడం కరెక్టా కాదా అని చర్చించాం. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్న అందరికీ మా టీజర్ ఓ టాపిక్ అవుతుందని ధైర్యంగా విడుద చేశాం. ప్రపంచ వ్యాప్తంగా రెస్పాన్స్ అదిరింది. ఇలాంటి సమయంలో విడుదల చేస్తారా అన్న బ్యాక్లాష్ రాకపోవడం మేము చేసింది కరెక్ట్ అనుకున్నాం. అయితే ఇప్పుడు తారక్ టీజర్ వచ్చేసరికి మనందరం లాక్డౌన్లో ఉన్నాం. ప్రస్తుతం సర్వర్లో ఉన్న మెటీరియల్తో కొంత వరకూ చేస్తున్నాం. కొంత షూట్ చేయాల్సి ఉంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో వేచి చూడాలి.
మీ నెక్స్ట్ మూవీకి సంబంధించిన వర్క్ జరుగుతుందా.?.
‘ఆర్ఆర్ఆర్’ పనుతో పాటు కొత్త కథపై వర్క్ చేస్తున్నా. అయితే… ఇప్పుడే పూర్తి వివరాలు చెప్పలేను. నాన్నగారు, అన్నయ్యతో వీడియో కాల్స్లో కొన్ని ఐడియాలు డెవలప్ చేస్తున్నా. స్క్రిప్ట్ అని అనలేను.
తదుపరి మూవీ మహేష్బాబుతోనే చేస్తున్నారా?
ఇప్పటికే దీనికి చాలా సార్లు సమాధానం చెప్పేశాను. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కె.ఎల్.నారాయణగారి నిర్మాణంలో మహేశ్బాబుగారు హీరోగా సినిమా ఉంటుంది. అని ఇంటర్వ్యూ పూర్తి చేశారు డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి.













