హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్న్యూస్

ప్రయాణికులకు హైదరాబాద్ మైట్రో రైలు గూడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2025 మార్చి 31 వరకు ఆఫర్లను పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది. అలాగే అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.