CP Sajjanar: నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు : సీపీ సజ్జనార్
నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించామని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) అన్నారు. 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కవచ్, డ్రోన్ల (Drones) వినియోగంలో ముందున్నట్లు తెలిపారు. తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇతర రాష్ట్రాల నేరగాళ్లు భయపడుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఏడాది హైదరాబాద్ (Hyderabad) నగరంలో నేరాలు 15 శాతం తగ్గాయి. గతేడాది అత్యాచార కేసులు 484 నమోదైతే ఈ ఏడాది 405 నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు గతేడాది 324 నమోదైతే ఈ ఏడాది 166 ఫైల్ అయ్యాయి. ప్రాపర్టీ వివాద కేసులు 64 శాతం మేర తగ్గాయి. నేరాల్లో శిక్షలు పడిన కేసుల సంఖ్య కూడా బాగా పెరిగింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య 3,058 నుంచి 2,678ఎjకి తగ్గిందన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ ఫీ సొసైటీ (Drug-free society) కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి. బహిరంగ వేడుకలు నిర్వహించాలని సూచిస్తున్నాం. మద్యం తాగిన వారు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నా. కుటంబ సభ్యులతో ఇళ్లలోనే వేడుకలు చేసుకుంటే మంచిది. రాష్ అండ్ డేంజరస్ డ్రైవింగ్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడతాం అని తెలిపారు.






