సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతల భేటీ

సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్. వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. నల్లగొండ` ఖమ్మం`వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై ఈ భేటీలో చర్చించారు.