సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ నుంచి కొండగల్ వెళ్తుండగా మార్గమాధ్యలో సీఎం కాన్వాయ్లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. మరోవైపు సీఎం భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్ను సిబ్బంది పిలిపించారు. ఈ ఘటన జరిగాక ఈ ఒక్క కారు తప్ప మిగిలిన వాహనాలతో కొడంగల్ పట్టణంలోని తన నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ చేరుకున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చిన రేవంత్కు ఘన స్వాగతం పలికారు.