ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం కవితను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని బీఆర్ఎస్ లీగల్సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భారత్ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండిరగ్లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు.