ఏపీలో కొత్తగా 6,952 కేసులు..

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,08,616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,952 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరరకు రాష్ట్రంలో 18,03,074 మందికి కరోనా వైరస్ సోకింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 58 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,882 కు చేరింది. 24 గంటల్లో 11,577 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటి వరకు 16,96,880 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 91,417 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,03,48,106 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,119 కేసులు, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 228 కేసులు నమోదయ్యాయి.