ఏపీలో కొత్తగా 8,766 కేసులు… 67 మంది

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 93,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8,766 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో 67 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 11,696కి చేరింది. 24 గంటల్లో 12,292 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,64,082కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,00,39,764 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,980, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 265 కేసులు నమోదయ్యాయి.