ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కమ్ముకొస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య వందలు దాటి వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 31,268 నమూనాలను పరీక్షించగా 2,558 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,15,832కి చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది.
24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్తో మృతిచెందిన వారి సంఖ్య 7,268కి చేరింది. ఒక్కరోజులో 915 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం 14,913 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,33,851 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు 8,93,651 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.