ఏపీలో కొత్తగా 1,908 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 80,376 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో 23 మంది మృతి చెందారు. తాజాగా 2,103 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్జార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,51,08,146 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,46,370 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,513 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,375 మంది పాజిటిట్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,80,258 మంది కరోనా బారిన పడ్డారు.
కృష్ణా జిల్లాలో కరోనాతో నలుగురు మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.







