ఏపీలో కరోనా ఉధృతి

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 82,297 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,145 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 24 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,468కు చేరింది. కరోనాతో 2,003 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటి వరకు 19,42,371 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,76,141కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,49,46,265 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు, కృష్ణ జిల్లాల్లో నలుగురు, కడప, పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరిలో జిల్లాలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.