ఏపీలో కొత్తగా 2,442 కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 85,822 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,442 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటలలో కరోనాతో 16 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,444కు చేరింది. 24 గంటల్లో 2,412 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటి వరకు 19,40,368 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,184 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,73,996కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,48,63,968 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.