ఏపీలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు..

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 89,535 మంది కరోనా పరీక్షలు చేయగా.. 22,517 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో తెలిపింది. కరోనా 98 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ 14,11,320 మంది వైరస్ బారినపడగా, మొత్తం 1,78,80,755 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. తాజాగా 18,739 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 11,94,582 మంది కరోనా నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 3,383 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 992 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్తో గత 24 గంటల్లో అనంతపురంలో 12 మంది, విశాఖ 9, విజయనగరం 9, చిత్తూరు 8, నెల్లూరులో 11, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, కర్నూలు 5, ప్రకాశం 5, తూర్పుగోదావరి 10, శ్రీకాకుళం 8, గుంటూరు 7, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.